జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు పండిట్ దీన దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా సమర్పణ దివస్ నిర్వహించినట్టు బిజెపి మైనార్టీ మోర్చా జాతీయ కార్యదర్శి బాబ్జీ వెల్లడించారు. కడప జిల్లా రాజంపేట లోని ఆర్వీ కళ్యాణ మండపం లో భారతీయ జనతా పార్టీ రాజంపేట అసెంబ్లీ కన్వీనర్ పోతుగు౦ట రమేష్ నాయుడు ఆధ్వర్యంలో సమర్పణ దివస్ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బాబ్జీ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం పని తీరు చూసిన తర్వాత ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి, బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షులు నాగోతు రమేష్ నాయుడు, బీజేవైఎం జాతీయ కార్యదర్శి పనల సురేష్, బిజెపి పట్టణ అధ్యక్షులు ఎం ఎం వెంకట సుబ్బయ్య నాయుడు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అమ్మినేని విజయేంద్ర బాబు, బిజెపి రాష్ట్ర కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బీరంగి రేవతి తదితరులు పాల్గొని పండిట్ దీన్ దయాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.