గత కొద్ది కాలముగా అనారోగ్యంతో బాధపడుతూ రామంతపూర్ తెరాస నాయకులు సంభేటి నరేష్ సతీమణి శ్రీలత పరమపదించారు. శుక్రవారం తెరాస సీనియర్ నాయకులు, బిఎల్ఆర్ ట్రస్ట్ చైర్మన్ బండారి లక్ష్మారెడ్డి శ్రీలత భౌతిక కాయానికి నివాళులు అర్పించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.
ఆమె అంత్యక్రియలకు అయ్యే ఏర్పాట్లను చేయిస్తూ 20,000/- వేలు ఆర్థిక సహాయాన్ని నరేష్ కి అందించారు. వారి కుటుంబానికి మనో ధైర్యాన్ని కలిగిస్తూ వారికి అండగా ఉంటానని లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెరాస నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి