వరంగల్ లోని హన్మకొండ కు చెందిన రోహిణి ఆస్పత్రిలో దారుణం జరిగింది. బిల్లు చెల్లిస్తేనే పేషంట్ ను అడ్మిట్ చేసుకుంటామని ఆసుపత్రి చెప్పడంతో ఆమె ప్రాణాలు పోయాయి.
కొమురమ్మ అనే ఆమె తీవ్ర అస్వస్థతతో రోహిణి ఆసుపత్రికి వచ్చింది. ఆమెను ఇంటి నుంచి అంబులెన్సులో తీసుకువచ్చారు.
అంబులెన్సు ఆసుపత్రి వద్దకు చేరిన వెంటనే రోగిని చేర్చుకోవాల్సిన సిబ్బంది అడ్వాన్సు బిల్లు చెల్లించాలని పట్టుబట్టారు.
ముందుగా బిల్లు కట్టాలని అప్పుడే చేర్చుకుంటామని చెబుతూ దాదాపు గంటపాటు పేషంట్ ను అంబులెన్స్ లోనే వదిలేశారు.
దాంతో ఆమె అంబులెన్సులోనే మరణించింది. దాంతో పేషంట్ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహంతో ఆస్పత్రి ఫర్నీచర్ ధ్వంసం చేశారు.