30.7 C
Hyderabad
May 5, 2024 04: 08 AM
Slider వరంగల్

రోహిణి ఆసుపత్రి నిర్వాకంతో అంబులెన్సులోనే రోగి మృతి

#Hospital

వరంగల్ లోని హన్మకొండ కు చెందిన రోహిణి ఆస్పత్రిలో దారుణం జరిగింది. బిల్లు చెల్లిస్తేనే పేషంట్ ను అడ్మిట్ చేసుకుంటామని ఆసుపత్రి చెప్పడంతో ఆమె ప్రాణాలు పోయాయి.

కొమురమ్మ అనే ఆమె తీవ్ర అస్వస్థతతో రోహిణి ఆసుపత్రికి వచ్చింది. ఆమెను ఇంటి నుంచి అంబులెన్సులో తీసుకువచ్చారు.

అంబులెన్సు ఆసుపత్రి వద్దకు చేరిన వెంటనే రోగిని చేర్చుకోవాల్సిన సిబ్బంది అడ్వాన్సు బిల్లు చెల్లించాలని పట్టుబట్టారు.

ముందుగా బిల్లు కట్టాలని అప్పుడే చేర్చుకుంటామని చెబుతూ దాదాపు గంటపాటు పేషంట్ ను అంబులెన్స్ లోనే వదిలేశారు.

దాంతో ఆమె అంబులెన్సులోనే మరణించింది. దాంతో పేషంట్ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహంతో ఆస్పత్రి ఫర్నీచర్ ధ్వంసం చేశారు.

Related posts

అరుదైన గ్రహ కలయిక: ఆరు రాష్ట్రాలలో రాజకీయ సంక్షోభం

Satyam NEWS

దొంగతనం చేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు

Bhavani

రాజాంలో వైసీపీ ప్రచార రథం ఢీకొని బాలుడు మృతి

Satyam NEWS

Leave a Comment