దేశంలో ఏకైక నీతి వంత మైన నాయకుడు పవన్ కళ్యాణ్ అని ఉమ్మడి జిల్లా జన సేన నాయకులు ఆకుల నరసయ్య తెలిపారు. అన్నమయ్య జిల్లా రాజంపేట జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధికారంలోకి వచ్చే వరకు తాము తమ చివరి రక్తపు బొట్టు వరకు శ్రమిస్తామని వెల్లడించారు.
పొత్తు పై అర్ధం పర్ధం లేని విమర్శలు చేస్తున్నారని, తల్లిదండ్రులు కలయికతో పుట్టిన మనకు పొత్తులు ఓ లెక్క కాదని తెలిపారు. ఎమ్మెల్యే గా గెలవలేదని పవన్ కళ్యాణ్ ను హేళన చేస్తున్నారని వారికి వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని అన్నారు. తమకు తమ నాయకుడు కుల మతాలకు అతీతంగా అందరిని కలుపుకొని పోయేలా దిశ నిర్దేశం చేశారని అన్నారు.
తాము తమ నాయకుడు ఏపార్టీ వారిని వ్యక్తి గతంగా విమర్శించ మని అది తమ అధినేత పవన్ కళ్యాణ్ నేర్చు కున్నామని అన్నారు. తాము ప్రజల పక్షాన పోరాడు తుంటే వైసీపీ నేతలు తమ పై తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. పోలీసులకు భరోసా ఒక్క ధైర్యం ఇచ్చే నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమే అని ఆయన తెలిపారు.
దేశంలోనే సభ్యత్వం తీసుకున్న కార్యకర్తకు 5 లక్షలు ప్రమాద భీమా కలిపిస్తున్న ఒకే ఒక్క పార్టీ జనసేన అని ఆయన వెల్లడించారు. ఇంకా ఈ సమావేశం లో ఉమ్మడి జిల్లా జనసేన నాయకులు బాస్కర పంతుల,పొత్తూరు వీరయ్య ఆచారి,తాళ్ళపాక శంకరయ్య,సింగర వెంకట సుబ్బయ్య,కరణం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.