ఝార్ఖండ్ లోని హజారీబాగ్ జిల్లాలోని ఓ బ్రిడ్జిపై కనిపించిన వింత ఆకారం దానిపై ప్రయాణిస్తున్న వాహన దారుల్లో భయాందోళనలను కల్గించింది. చాడ్వా డ్యామ్ వంతెనపై రాత్రిపూట వాహనదారులకు ఓ విచిత్ర ఆకారం కనిపించింది. బైక్ మీద అటుగా వచ్చిన వ్యక్తులు దీన్ని తమ ఫోన్ లోని కెమెరా వీడియోలో రికార్డు చేశారు.
బ్రిడ్జిపై వెళుతున్న పలువురు వాహనదారులు ఈ వింత ఆకారాన్ని చూసి భయాందోళనలకు గురయ్యారు. ఆ ఆకారాన్ని గుర్తించి తమ వాహనాలు దూరంగా నిలిపివేశారు. ఆ తరువాత ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం తో సోషల్ మీడియాలో ఈ వీడియో సందడి చేస్తోంది.
కాగా, కొందరు దీనిని దెయ్యం అంటుంటే మరికొందరు ఏలియన్ గ్రహాంతర జీవి గా ప్రచారం చేస్తున్నారు. అయితే, ఇదంతా ఎవరో తమాషా కోసం చేసిన ప్రాంక్ అంటూ మరికొందరు కొట్టిపారేస్తున్నారు. మరోపక్క, దీని సంగతేంటో కాస్త చూడండంటూ మరికొందరు ఈ వీడియోను నాసాకు, ఇస్రోకు, ఎలాన్ మస్క్ కు ట్యాగ్ చేస్తున్నారు.మొత్తాని నికి మొదట భయపడిన జనం ఆ విచిత్ర ఆకారాన్ని గురించి తెలుసుకునేందుకు తీవ్రం గా యత్నిస్తున్నారు.