29.7 C
Hyderabad
May 7, 2024 03: 34 AM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ మున్సిపాలిటీ లో పెరిగిన ప్రజాసమస్యలు

#kollapurmunicipality

కొల్లాపూర్ మున్సిపాలిటీల్లో  కమిషనర్ లేనందున  ప్రజా సమస్యలు ఎక్కువైపోయాయని కొల్లాపూర్ మున్సిపల్ 8వ వార్డు కౌన్సిలర్ బరిగెల శ్రీలక్ష్మి వేణు గోపాల్ యాదవ్ శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కు ఈ మేరకు ఒక ప్రకటనలో తెలియజేశారు. మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి గత నెల పదవ తేదీ నుండి (లాగ్ లివ్ లో ఉన్నారు) అందుబాటులో లేకపోవడంతో  మున్సిపల్ కార్యాలయంలో ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని  తెలియజేశారు. కనీసం ఇన్చార్జి కమిషనర్ కూడా లేకపోవడంతో మున్సిపల్ పరిధిలో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. అధికారులు, నాయకులు ప్రజా సమస్యలను గాలికి  వదిలేస్తున్నారని, ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం బాధకలిగిస్తుందని చెప్పారు. కొందరు నాయకులు మున్సిపల్ పరిధిలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.కావున జిల్లా జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొవాలని కోరుతున్నారు. బర్త్ సర్టిఫికెట్లు,మరణ ధ్రువీకరణ పత్రాల కోసం వచ్చే ప్రజాల పట్ల కార్యాలయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.తక్షణమే కమిషనర్ ను ఏర్పాటు చేసే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరుతున్నారు.

Related posts

వినూత్నంగా మంత్రి గంగుల  కమలాకర్ దీపావళి వేడుకలు

Satyam NEWS

6,7,8 తేదీలలో మహిళాబంధు

Sub Editor 2

దేవాదాయ‌శాఖ‌మంత్రి లేకుండానే విగ్ర‌హ‌,క‌ల‌శ‌,ద్వ‌జ‌స్తంభ‌న ప్ర‌తిష్ట‌…!

Satyam NEWS

Leave a Comment