ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ రూపొందించిన ఒక గీతాన్ని తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక మంత్రి టి హరీష్ రావు నేడు ఆవిష్కరించారు. ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు రాజీవ్ ఈ గీతానికి దర్శకత్వం వహించి నిర్మించారు.
ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు మనో గాత్రాన్ని అందించారు. కరోనా పట్ల ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలనే అంశాలతో ఈ గీతాన్ని నిర్మించి విడుదల చేసిన రాజీవ్ ను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు.