29.7 C
Hyderabad
May 4, 2024 05: 10 AM
Slider ఖమ్మం

లోతట్టు ప్రాంతాల ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉండాలి

#Multi Zone-1 IG

గోదావరి వరద ముంపు ప్రాంతాల ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉండాలని మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి పోలీస్ అధికారులకు సూచించారు. భద్రాచలం ఏఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు గోదావరి నది వరదమొంపు ప్రాంతాల్లో పనిచేసే పోలీసు అధికారులతో సమావేశమయ్యారు.ముందుగా భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతిని పరిశీలించడానికి వచ్చిన ఐజీ గారిని జిల్లా ఎస్పీ గారు స్వాగతం పలికారు.

అనంతరం గోదావరి బ్రిడ్జి పై నుండి వరద ఉధృతిని పరిశీలించారు.తర్వాత భద్రాచలం ఏఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ ముంపు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు.

ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ప్రజలకు అండగా ఉండాలని తెలియజేసారు.ప్రజలు కూడా అధికారుల సూచనలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.

Related posts

NSUI ఆధ్వర్యంలో సిఎం దిష్టి బొమ్మ దగ్ధం

Satyam NEWS

బీఆర్ఎస్‌లో మహారాష్ట్ర నేతల చేరిక

Bhavani

కనీస సౌకర్యాలు లేకుండా కుటుంబ నియంత్రణ క్యాంపు పెడితే ఎలా?

Satyam NEWS

Leave a Comment