మహారాష్ట్రలోని జల్గాన్, ధూలే, లాతూర్ జిల్లాల నుంచి బీజేపీ, ఇతర పార్టీల నాయకులు, మాజీ అధికారులు బీఆర్ఎస్లో చేరారు. హైదరాబాలో మంత్రి హరీష్ రావు సమక్షంలో చేరారు. మంత్రి గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు.
చేరిన వారిలో జెడ్పీ సభ్యుడు ఓంకార్ అబ్బా జాదవ్, జల్గావ్ జెడ్పీ సభ్యుడు విజయ్ తవర్, మార్కెట్ కమిటీ చైర్మన్ సభాపతి విఠల్ నాగ్రాలే, మాజీ సభాపతి నారాయణ్ అబా పవార్, ధూలే నుంచి వినోద్ పాటిల్, సంచాలక్ మార్కెట్ కమిటీ సభ్యులు జగన్నాథ్ బావస్కర్, జనతా పార్టీ లాతూర్ జిల్లా అధ్యక్షుడు జయసింగ్ జాదవ్, భోర్ సేన అధ్యక్షుడు బబ్లూ జాదవ్, కాంగ్రెస్ పార్టీ నుంచి వికాస్ బంజారా, బీజేపీ తహసిల్ సెక్రటరీ విలాస్ రాథోడ్, ముస్లిం కౌన్సిల్ నుంచి తయ్యబ్ షేక్, మాజీ కమిషనర్ సోనవ్నే తదితరులు ఉన్నారు.