అన్నమయ్య జిల్లా రాజంపేట తోట కళ్యాణ మండపంలో తిరుప్పావై భక్తజన సేవాసమితి రాజంపేట వారి ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ గోదాదేవి, శ్రీ మహాలక్ష్మీదేవి సమేత శ్రీ ప్రసన్న రంగనాథ స్వామి కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది.ఈ కల్యాణంకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. వేద పండితులు వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించారు
శ్రీ గోదాదేవి,శ్రీ మహాలక్ష్మీ దేవి సమేత శ్రీ ప్రసన్న రంగనాథ స్వామి కల్యాణోత్సవానికి కోసం పుణ్యాహవచనం, విష్వక్సేన ఆరాధన, అంకు రార్పణ,కంకణపూజ నిర్వహించారు.తొలుత సర్కారు సంకల్పం,అనంతరం భక్తులందరితో సంకల్పం చేయించారు.
ఆభరణాలు,పుష్పమాలలతో విశేషంగా అలంకరించిన శ్రీ గోదాదేవి శ్రీ రంగనాథస్వామి వారికి కంకణాలు కట్టి వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. కళ్యాణం అనంతరం అర్చకులు శ్రీ గోదాదేవి రచించిన 10 పాశురాలను పఠిస్తూ, వారణ మాయిరం క్రతువు నిర్వహించారు. చివరగా నివేదన, మంగళ హారతితో కళ్యాణ వేడుక ముగిసింది.
ఈ సందర్భంగా కళా కారులు శ్రీవారి వైభవాన్ని చాటుతూ కీర్తనలు ఆలపించారు. భక్తులు సామూ హికంగా గోవింద నామాలు పఠించారు.పాల్గొన భక్తులకు తీర్థ ప్రసాదాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. అంతకు ముందు గోపూజ నిర్వహించారు.ఈ కార్య క్రమంకు తిరుప్పావై భక్తజన సేవాసమితి సేవకులు వర్ది బోయిన శ్రీధర్,తోట నగేష్, రేవంత్, సాయి,పళ్లెం ప్రసాద్,జి.సరితా,లక్షా, యల్.బాస్కర్ రెడ్డి,తుంగా గోపాల్ రెడ్డి,చంద్ర మౌళి, తదితరులు ఆధ్వర్యం వహించారు.