37.2 C
Hyderabad
April 30, 2024 12: 52 PM
Slider ముఖ్యంశాలు

కదులుతున్న రైలు నుంచి మహిళను తోసేసిన టిటిఇ

#train

జనరల్ టిక్కెట్ తీసుకుని రిజర్వేషన్ బోగిలో ఎక్కిందనే కోపంతో ఓ మహిళా ప్రయాణికురాలిని టిటిఇ కదులుతున్న రైలు నుంచి తోసేసిన సంఘటన చోటు చేసుకుంది. వివరా ల్లోకి గురువారం రాయలసీమ ఎక్స్ ప్రెస్ రైలు అన్నమయ్య జిల్లా రాజంపేట రైల్వేస్టేషన్కు రాత్రి 7.20 సమయం లో చేరుకుంది. ఓ మహిళ రైలు చివరలో ఉన్న ఎస్-2 రిజర్వేషన్ బోగిలో ఎక్కింది. టికెట్ పరిశీలనలో టిటిఇ ఆమె జనరల్ టికెట్ తీసుకుని రిజర్వేషన్ బోగిలో ఎక్కిందని ఆగ్రహించిన టిటిఇ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలోపు రైలు కదిలింది.

తర్వాత స్టేషన్లో జనరల్ బోగిలోకి వెళతానని చెప్పినా వినకుండా మహిళను టిటిఇ రైలు నుంచి బయటకు తోసేయడంతో ఆమె ప్లాట్ఫాం మీద పడిపోయింది. ఎలాంటి గాయాలు కాలేదు. వెంటనే ప్రయాణికులు చైన్ లాగి రైలును నిలిపివేశారు. దీంతో ప్రయాణికులంతా రైలు దిగి టిటిఇ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి అదుపు తప్పుతోందని భావించిన రైల్వే అధికారులు రాయలసీమ ఎక్స్ప్రెస్కు వెళ్లేందుకు సిగ్నల్ ఇచ్చారు. అనంతరం స్థానిక రైల్వే అధికారులు మహిళను ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. టిటిఇ నిర్వాకం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.

Related posts

అధికారుల నిర్లక్ష్యంతో పోతున్న ప్రాణాలు

Satyam NEWS

బీజేపీ, టిడిపి, వామపక్షాల ఆధ్వర్యంలో సంబరాలు

Satyam NEWS

నిర్మల్ లో అభివృద్ధి పనులను వేగవంతం చేయండి

Satyam NEWS

Leave a Comment