రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం అధినాయకత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది.ఈ నేపధ్యంలో రాష్ట్రంలో గెలుపు గుర్రాలకు టిక్కెట్ ఇవ్వాలని వివిధ కోణాల్లో సర్వేలు నిర్వహించి ఆయా స్థానిక పరిస్థితుల కనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేస్తోంది.ఈ నేపధ్యంలో అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంట్ స్థానానికి యువ పారిశ్రామిక వేత్త టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరగా ఆయన రాజంపేట టీడీపీ ఎంపీ అభ్యర్థిత్యాన్నీ ఖరారు చేశారు.
రాజంపేటకే చెందిన గంటా నరహరి బెంగళూరు కేంద్రంగా వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఈ క్రమంలో 2017-2018లో రాష్ట్రపతి నుంచి ఉత్తమ యువ పారిశ్రామికవేత్తగా అవార్డు అందుకున్నారు. గంటా నరహరి రాజకీయాలకు కొత్తే అయినా, ఆయన కుటుంబం మాత్రం చాలా కాలం రాజకీయాల్లో కొన సాగుతున్నదే. దివంగత ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడు భార్య దివంగత సత్యప్రభ సోదరి కుమార్తెను నరహరి వివాహం చేసుకున్నారు.గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సత్యప్రభ ఓటమి పాలయ్యారు.
ఆ తర్వాత అనారోగ్య కారణాలతో ఆమె మరణించారు.ఈ క్రమంలోనే నరహరికి ఆహ్వానం పలికిన టీడీపీ.వచ్చే ఎన్నికల్లో రాజంపేట లోక్ సభ స్థానం నుంచి తన అభ్యర్థిగా ఆయనను ప్రకటించింది.ఆయన స్థానిక నేతలను కలుపుకుని తరచూ నియోజకవర్గ పరిధిలో పర్యటి స్తున్నారు.ఆర్థిక బలం అంగ బలం ఉన్న స్థానిక వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కి తగ్గ సమఉజ్జి గా దీటైన అభ్యర్థిగా గంటా నరహారి అని ప్రచారం జరుగుతోంది. దీనితో టీడీపీ లో ఫుల్ జోష్ కనిపిస్తోంది.ఇక మిగిలింది రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి ఖరారు మాత్రమే.