అద్భుతమైన గంగా విలాస్ క్రూయిజ్ను బటన్ను నొక్కడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఫ్లాగ్ ఆఫ్ చేసారు. దీంతో పాటు గంగానది పై నిర్మించిన టెంట్ సిటీని కూడా ప్రారంభించారు. దేశంలోని అనేక నదులపై క్రూయిజ్ టూరిజం ప్రారంభించనున్నారు. ఇందుకోసం 111 జాతీయ జలమార్గాలను అభివృద్ధి చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు జలమార్గాలు కూడా ఉపకరిస్తాయి. దేశంలోని నదులను వస్తువుల రవాణాకు మరింత ఎక్కువగా ఉపయోగించవచ్చు.
అభివృద్ధి చెందాల్సిన భారతదేశ నిర్మాణానికి కనెక్టివిటీ చాలా అవసరం. 2014లో దేశంలో ఐదు జాతీయ జలమార్గాలు మాత్రమే ఉన్నాయి. నేడు 24 రాష్ట్రాల్లో 111 జాతీయ జలమార్గాల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.
ఇంతకు ముందు ఇలాంటి అనుభవం కోసం దేశ ప్రజలు విదేశాలకు వెళ్లేవారని, ఇప్పుడు దేశంలోనే ఈ అనుభూతిని పొందవచ్చునని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు. చాలా నగరాల్లో ఇదే విధానాన్ని అమలు చేయబోతున్నామని ఆయన వివరించారు.