అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కాకినాడ నగరంలో సెలబ్రేటీ సిక్రేట్స్ అడ్వాన్స్ హెయిర్ & స్కిన్ స్టూడియో ప్రారంభం అయింది. కాకినాడ రాజారామ్ మోహన్ నగర్లో బుధవారం ఈ స్టూడియోను ప్రముఖ సినీ నటి పూర్ణ ప్రారంభించారు. ఈ స్టూడియో లో చర్మ సౌందర్యం, ముఖ సౌందర్యం కోసం ప్రయత్నించే వారందరికీ అందుబాటులో ఈ సెలబ్రేటీ సిక్రేట్స్ స్టూడియో ఉపయోగపడుతుందన్నారు.
ఈ స్టూడియో అధినేత టి మాధవి మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా కాకినాడ చుట్టూ పక్కల గ్రామాల ప్రజలకు సౌందర్య వికాస పరంగా పలు రకాల సేవలను అందిస్తున్నారన్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ఎంతోమంది సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులకు స్టూడియోలో కాస్మెటిక్స్ సేవలను అందిస్తున్నట్లు చెప్పారు కాకినాడ, విజయవాడ, హైదరాబాదులలో తమ బ్రాంచ్లు ఉన్నాయని మరో బ్రాంచ్ను హైదరాబాదులో ప్రారంభిస్తున్నట్లు చెప్పారు
పలు ప్రదేశాలలో చర్మ సౌందర్య సంబంధించి చికిత్స చేయించుకున్న వారు ఫలితం రానిపక్షంలో తమ సెలబ్రిటీ స్టూడియో సీక్రెట్ స్టూడియో కి రావాలని అని మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వెంకట్ తెలిపారు ఈసారి సందర్శించి తమ సేవలను వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మేయర్ సుంకర శివ ప్రసన్న, కుడా చైర్మన్ రాగి రెడ్డి చంద్రకళ దీప్తి, నటుడు రాజా రవీంద్ర, నటీమణులు హేమ, రజిత, హిమజ, జయలక్ష్మి, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.