రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమైంది. నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్లో ఈనెల 20న బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తోంది. ఈ సభకు హాజరుకావాలని కోరుతూ ప్రియాంక గాంధీకి టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి లేఖ రాశారు.
ఈనెల 20న జరిగే సభకు ప్రియాంక హాజరవుతారని, జూపల్లి కృష్ణారావుతో పాటు జోగులాంబ గద్వాల జిల్లాలోని పలువురు నేతలు పార్టీలో చేరుతారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.