ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ రైల్లో విధి నిర్వహణలో ఉన్న ఒక రైల్వే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. అకస్మాత్తుగా తుపాకితో కాల్చుకుని ఆయన మరణించడానికి కారణాలు తెలియడం లేదు. ముంబయి నుంచి చెన్నై వెళుతున్న మెయిల్ లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కు చెందిన కానిస్టేబుల్ ఆర్ ఎస్ పన్వర్ విధులు నిర్వర్తిస్తున్నాడు.
ఒంటిమిట్ట రైల్వే స్టేషన్ దాటాక పన్వర్ తుపాకితో కాల్చుకుని మృతి చెందారు. నందలూరు రైల్వే స్టేషన్లో వైద్య సేవలు అందించి కడప రిమ్స్ కుతరలించే లూపే అతను మరణించినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఆత్మహత్య కు గల వివరాలు రైల్వే పోలీసులు విచారిస్తున్నారు.