హైదరాబాద్ లోని ముషీరాబాద్ పరిధి కి చెందిన గాంధీనగర్ డివిజన్ లో కరోనావైరస్ నివారణకు ఉచితంగా హోమియో మందు పంపిణీ చేశారు. కార్పొరేటర్ ముఠా పద్మ నరేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉచిత మందులు పంపిణీ కార్యక్రమాన్ని మాజీ హోం శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి ప్రారంభించారు.
స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ ఈ మందులు అందరూ వాడాలని చెప్పారు. ముందుగానే ఈ హోమియో మందు వాడటం ద్వారా ఈ వైరస్ అనేది రాదు అని ఆయన అన్నారు. కార్పొరేటర్ ముఠా పద్మ నరేష్ యువ నాయకుడు జై సింహ కార్యకర్తలు అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ హోమియో వైద్యుడు మూర్తి ఈ మందులను పంపిణీ చేశారు.