వైఖానస ఆగమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు గా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రానికి చెందిన నరగిరినాధుని రంగ భట్రాచార్యులు ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా తూమాటి శ్రీనివాసాచార్యులు, గౌరవాధ్యక్షుడు గా అర్వపల్లి రాంబాబు, కోశాధికారిగా మురళీ కృష్ణమాచార్యులు, గౌరవ సలహాదారులుగా తుళ్లూరి పద్మనాభాచార్యులు, ఉపాధ్యక్షుడు గా పి.హరి సిరికొండ అనంతకృష్ణ దేపల్లి మణికుమార్ ఆచార్యులు ఎన్నికైనారు. ఇటీవల హుజూర్ నగర్ లోని శ్రీ సీతారామ చంద్ర వేణుగోపాల స్వామి ఆలయం జరిగిన వైఖానస ఆగమ పరిషత్ జిల్లా కమిటీ సమావేశంలో రాష్ట్ర నాయకుల సమక్షంలో కమిటీని ఎన్నుకున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో రాఘవాచార్యులు నరసింహాచార్యులు తదితర వైఖానస ఆగమ శాస్త్ర పండితులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్