శ్రీ రామాంజనేయ ఆసరా స్వచ్ఛంద సంస్థ నాట్య కళా మండలి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ముగ్గుల పోటీలలో బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ బూరుగడ్డ గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన రంగవల్లుల పోటీలు అత్యంత ఆనందోత్సవాల మధ్య జరిగాయి. మహిళలు వివిధ రకాల రంగులతో ముచ్చటగొల్పే రంగవల్లులను తీర్చి దిద్దారు.రంగురంగుల రంగవల్లులు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ముగ్గుల పోటీలలో ప్రథమ బహుమతి గూడెపు రాధిక,ద్వితీయ బహుమతి కొత్తపల్లి స్వతంత్ర,తృతీయ బహుమతి గంధం నవ్య,చతుర్ధ బహుమతి బహుమతి మాడుగుల నాగలక్ష్మి గెలుపొందారు.ఈ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్,న్యాయ నిర్ణయతలుగా తన్నీరు పుష్పావతి,చికూరి లీలావతి విన్నపం పోరాటం చైర్మన్ వ్యవహరించారు.
మహిళలకు భక్తి పట్ల,సమాజం పట్ల,కుటుంబం పట్ల, స్వచ్ఛంద సేవ పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ఆసాంతం రామాంజనేయ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు,సంస్థ చైర్మన్ చిమట సైదులు,ఆవుల వెంకటయ్య,వైస్ చైర్మన్ మాడుగుల చిన్న మల్లయ్య,తుమ్మల మట్టపల్లి దగ్గరుండి నిర్వహించారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్