గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉత్తరాయణ పండుగను వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా పాల్గొన్నారు. సూర్యుని ఉత్తరాయణ గమనం సందర్భంగా ప్రజలు గాలిపటాలు ఎగురవేస్తూ ఆనందించారు. ఈ సందర్భంగా ఆకాశమంతటా రంగురంగుల గాలిపటాలు రెపరెపలాడాయి. హోంమంత్రి అమిత్ షా కూడా అహ్మదాబాద్లోని వెజల్పూర్లో తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, బీజేపీ నేతలతో కలిసి పండుగ జరుపుకున్నారు. జగన్నాథ ఆలయంలో ప్రార్థనలు చేస్తూ కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తన దినచర్యను ప్రారంభించారు. ఆ తర్వాత, హోం మంత్రి తన భార్యతో కలిసి వెజల్పూర్లోని రెసిడెన్షియల్ సొసైటీకి చేరుకున్నారు.
అక్కడ వారు స్థానిక బిజెపి నాయకుడి ఇంటి టెర్రస్పై గాలిపటం ఎగురవేస్తూ ఆనందించారు. కాగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గాంధీనగర్లోని రాజ్భవన్కు చేరుకుని గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ను కూడా కలిశారు. మరోవైపు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా పండుగను పురస్కరించుకుని దరియాపూర్ చేరుకుని తన పాత మిత్రులను, బీజేపీ నేతలను కలిశారు. అక్కడ ఓ డాబాపై నుంచి గాలిపటాలు కూడా ఎగురవేశారు. అయితే పండుగల సమయంలో కొన్ని ఘోర ప్రమాదాలు కూడా జరిగినట్లు వార్తలు వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెహసానా జిల్లా విస్నగర్ పట్టణంలో చైనా మాంజా వాడకం వల్ల మూడేళ్ల బాలిక గొంతు కోసి మృతి చెందింది. పలు చోట్ల గాలిపటాల తీగలలో చైనీస్ మాంజా కారణంగా గాయపడినట్లు, గాలిపటాలు ఎగురవేసే సమయంలో ఎత్తు నుంచి పడిపోతున్నట్లు వార్తలు వచ్చాయి.