40.2 C
Hyderabad
May 5, 2024 16: 08 PM
Slider పశ్చిమగోదావరి

అసలే అధికార పార్టీ… అందులోనూ రౌడీ షీటర్…

#attack

అసలే అధికార పార్టీ… అందులోనూ రౌడీ షీటర్… మరింకేం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరంలో ఒక రౌడీ షీటర్ రెచ్చిపోయాడు. ఒక ట్రావెల్స్ ఆఫీస్ పై అనుచరులతో దాడి చేశాడు. ఆలస్యంగా వెళ్లి కూడా అప్పటికే వెళ్లిపోయిన బస్ ని వెనక్కి రప్పించాలంటూ హుకుం జారీ చేశాడు.

అయితే ఇతర ప్రయాణికులు ఇబ్బంది పడతారు, కావాలంటే తరవాత బస్ లో ఎక్కిస్తాము అని ట్రావెల్ సిబ్బంది చెప్పినా వినిపించుకోలేదు. నేనెవరో తెలుసా అంటూ అనుచరులతో కలిసి ట్రావెల్ సిబ్బంది పై ఆ రౌడీ షీటర్ పైశాచిక దాడి చేశాడు.

రౌడీ షీటర్ భార్య, ఏలూరు అధికార పార్టీ మహిళా కార్పొరేటర్ భీమవరపు హేమ సుందరి దగ్గరే ఉండి దాడిని ప్రోత్సహించింది. ట్రావెల్ ఆఫీస్ సిసిటివిలో రౌడీ షీటర్ దాడి దృశ్యాలు అన్నీ రికార్డ్ అయ్యాయి. పోలీస్ కి ఫిర్యాదు చేస్తే మళ్ళీ వచ్చి కొడతాం అంటూ బెదిరింపులు చేశారు.

అయితే ఎలాగోలా ధైర్యం చేసి ట్రావెల్స్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏలూరు 3వపట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఏలూరులోని ఆ రౌడీ షీటర్ పేరు భీమవరపు సురేష్.

గత నెలలో ఏలూరు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక డాక్టర్ ని బెదిరించి కోట్ల రూపాయల ఆస్తి కాజేసే యత్నం ఘటన పై ఏలూరు 2వ పట్టణ స్టేషన్లో అతనిపై కేసు నమోదు అయింది. ఏలూరు నగరంలో రౌడీ షీటర్స్ రెచ్చిపోతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు.

Related posts

కంపెనీలను వెళ్లగొట్టినవారు ఇప్పుడు రమ్మంటున్నారు

Satyam NEWS

`ఓదెల రైల్వేస్టేషన్`లో `స్పూర్తి`గా పూజిత పొన్నాడ‌ లుక్ విడుద‌ల‌

Satyam NEWS

లోప భూయిష్టంగా జిల్లాలో భాషోపాధ్యాయుల పని సర్దుబాటు

Bhavani

Leave a Comment