ఈ కార్తీక మాసం.. పుణ్యప్రదమైన మాసం.ఆ లయకారుడైన శివుని దర్శనం చేసుకుంటే ప్రతీ ఒక్కరికీ పుణ్యఫలమే.ఈ అవకాశాన్ని ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ ప్రయాణీకులకు అవకాశం కల్పిస్తోంది. రాష్ట్రంలో పంచారామాలైన అమరావతి, పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం ,సామర్లకోట…ఈ అయిదు పుణ్య క్షేత్రాలను ఈ కార్తీక మాసంలో ఒకేసారి దర్శించుకుంటే ఎంతో పుణ్యఫలమని పెద్దల అభిమతం.ఆ ఉద్దేశ్యం తోనే విజయనగరం ఆర్టీసీ శాఖ… ఈ నవంబర్ లో నాలుగు కార్తీక మాసాలలో ఆ అయిదం శైవ క్షేత్రాలను దర్శించుకునే అవకాశం,….భక్త ప్రయాణీకులకు కల్పించింది.
ఈ మేరకు సూపర్ లగ్గరీకీ 1860,అల్ట్రా డీలక్స్ 1820,ఎక్సప్రెస్ 1460 రూపాయల చార్జీల తో రాను ,పోను సర్వీసులు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆదివారం 30 వ తేదీ సాయంత్రం విజయనగరం డిపో నుంచీ ఆర్టీసీ అధికారులు.. రెండు బస్సు సర్వీసులను జెండా ఊపి ప్రారంభించారు.మొత్తం 16 గంటలలో అయిదు పుణ్యక్షేత్రాలను దర్శనం చేయించి.. మరల గమ్యస్థానాలకు తీసుకువస్తాయి..బయలుదేర న ఆర్టీసీ బస్ సర్వీసులు.