28.7 C
Hyderabad
May 5, 2024 07: 18 AM
Slider హైదరాబాద్

పారిశుధ్య కార్మికుల సేవ‌లు ఎన‌లేనివి

ghmc talasani

పారిశుధ్య కార్మికుల సేవలు ఎనలేనివని, వారి సేవలు ఎంతో విలువైనవని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం సికింద్రాబాద్ లోని MG రోడ్ లో గల మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పారిశుద్ధ్య కార్మికులకు వేతనాల పెంపుపట్ల ముఖ్యమంత్రి KCR, మున్సిపల్ శాఖ మంత్రి KTR చిత్ర పటాలకు పాలాభిషేకం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల సేవలకు గుర్తింపు గానే ప్రభుత్వం భారీ ఎత్తున వేతనాలను పెంచడం సంతోషంగా ఉందన్నారు. లాక్ డౌన్ సమయంలో సైతం GHMC పారిశుద్ధ్య సైతం సేవలు అందించారని అభినందించారు. పాలాభిషేకం అనంతరం మంత్రి పారిశుద్ధ్య కార్మికులకు స్వీట్లు తినిపించారు. కార్మికులు బాణసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అరెస్ట్

Satyam NEWS

కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ మేఘారెడ్డిని గెలిపిద్దాం

Satyam NEWS

హక్కుల కమిషన్ కు వచ్చే బాధితుల సమస్యలు సత్వర పరిష్కారం

Satyam NEWS

Leave a Comment