తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 21,264 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 661 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,57,374కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది.
నిన్నఒక్కరోజే కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,404కి చేరింది.
కరోనాబారి నిన్న1,637 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నబాధితుల సంఖ్య 2,40,545కి చేరింది.
రాష్ట్రంలో ప్రస్తుతం 15,425 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 12,888 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇప్పటి వరకు తెలంగాణ నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 48,74,433కి చేరింది.