38.2 C
Hyderabad
May 3, 2024 21: 16 PM
Slider నల్గొండ

కాపు భవన్ నిర్మాణానికి అవసరమైన స్థలం ఇవ్వాలి

#munnurukapu

నియోజకవర్గ కేంద్రమైన హుజూర్ నగర్ లో మున్నూరు కాపులకు కాపు భవన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఎకరం స్థలం కేటాయించాలని జిల్లా కాపు సంఘం నేతలు కె.వేంకటేశ్వర్లు, కె.నాగేశ్వరరావు కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో పలు వార్డులలో వార్డు కమిటీలను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా వేంకటేశ్వర్లు, నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కాపులు అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు.ఆర్ధిక,రాజకీయ,సామాజికంగా కాపులు ఎదగాలని అన్నారు.కాపులలో ఐక్యత ఉంటే మన హక్కులను సాధించగలుగుతామని అన్నారు.

ఈ కార్యక్రమంలో కొట్టు బాబు, గార్లపాటి వీరస్వామి,ధూళిపాళ శ్రీనివాస్,కొట్టు మోహనరావు,రామిశెట్టి రాము, రాంబాబు, ముదిగొండ రవికుమార్,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంపై రాష్ట్రపతికి చంద్రబాబు ఫిర్యాదు

Satyam NEWS

హామీ నిలబెట్టుకోలేని జగన్ ప్రభుత్వంపై తిరుగుబాటు

Satyam NEWS

కేసీఆర్ ని కలిసిన పువ్వాడ

Bhavani

Leave a Comment