నియోజకవర్గ కేంద్రమైన హుజూర్ నగర్ లో మున్నూరు కాపులకు కాపు భవన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఎకరం స్థలం కేటాయించాలని జిల్లా కాపు సంఘం నేతలు కె.వేంకటేశ్వర్లు, కె.నాగేశ్వరరావు కోరారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో పలు వార్డులలో వార్డు కమిటీలను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా వేంకటేశ్వర్లు, నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కాపులు అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు.ఆర్ధిక,రాజకీయ,సామాజికంగా కాపులు ఎదగాలని అన్నారు.కాపులలో ఐక్యత ఉంటే మన హక్కులను సాధించగలుగుతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో కొట్టు బాబు, గార్లపాటి వీరస్వామి,ధూళిపాళ శ్రీనివాస్,కొట్టు మోహనరావు,రామిశెట్టి రాము, రాంబాబు, ముదిగొండ రవికుమార్,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్