సాలూరు పోలీసులకు “సత్యం న్యూస్. నెట్”.. హేట్సాఫ్ చెబుతోంది.
ఇటీవలే విజయనగరం జిల్లా రెండు గా విభజింపబడి….పార్వతీ పురం మన్యం జిల్లా గా ఆవిర్భవించిఞ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విజయనగరం జిల్లాలో ఉండే సాలూరు పోలీసు స్టేషన్ కొత్త గా ఏర్పడ్డ పార్వతీ పురం మన్యం జిల్లా పరిధిలో కి వెళ్లింది.తాజాగా ఆ జిల్లా కు చెందిన సాలూరు పట్టణంలో తొమ్మిది ఏళ్ల మైనర్ బాలిక రేప్ కేసు లో నిందితుడు కి కారాగార శిక్ష పడేలా…సాలూరు పోలీసులు కేసు ను సాక్ష్యాలతో నిరూపించారు.
ఇటీవలే 60 ఏళ్ల వృధ్ధుడు..9 ఏళ్ల మైనర్ గాల్ ని లైంగికంగా వేధించాడు.అప్పుడే బాలిక కన్నవారి నుంచీ వచ్చిన ఫిర్యాదు మేరకు సాలూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఇటీవలే విజయనగరం జిల్లా రెండు గా విభజన కావడం.. పోలీసు శాఖ సిబ్బంది కూడా బదిలీ అయ్యారు. అలాగే సాలూరు కూడా కొత్త గా ఏర్పడ్డ పార్వతీ పురం మన్యం జిల్లా లోకి వెళ్లింది.
అలాగే విజయనగరం సీసీఎస్ లో పని చేసిన సీఐ శ్రీనివాసరావు…సాలూరు పట్టణ సీఐగా బాధ్యతలు చేపట్టి…మైనర్ గాల్ కేసును టేకప్ చేసారు. ఈ క్రమంలో నిందితుడు విచారించి… కోర్ట్ లో ప్రవేశ పెట్టారు. వాదనలు విన్న కోర్టు నిందితుడు కి 20 ఏళ్ళు జైలు శిక్ష.. పదివేలు జరీమానా విధించింది. హేట్సాఫ్ సాలూరు పట్టణ పోలీసులు అని అంటోంది… సత్యం న్యూస్. నెట్.
ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా