ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇలా అడ్డుఆపూ లేకుండా పెరుగుతున్న కాలుష్యం దృష్ట్యా ఢిల్లీ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్యకలాపాలను నిషేధించారు. ఈ విషయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కాలుష్యం దృష్ట్యా ఢిల్లీ మొత్తం నిర్మాణ కార్యకలాపాలను నిలిపివేసినట్లు అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ కాలంలో ప్రతి నిర్మాణ కార్మికుడికి నెలకు రూ. 5000 ఆర్థిక సహాయంగా ఇవ్వాలని కార్మిక మంత్రి మనీష్ సిసోడియాను ఆదేశించినట్లు కేజ్రీవాల్ చెప్పారు. నిర్మాణ కార్యకలాపాల నిషేధం కొనసాగినన్ని రోజులు భవన నిర్మాణ కూలీలు ఈ మొత్తాన్ని పొందుతారు.
previous post