33.2 C
Hyderabad
May 4, 2024 00: 37 AM
Slider నల్గొండ

రైతులకు ఉచితంగా శానిటిజర్ ల పంపిణీ

#hujurnagar

ప్రస్తుత సమయంలో మానవాళిని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యక్తిగత దూరం పాటిస్తూ మాస్కు ధరించి చేతులను శుభ్రం చేసుకోవాలని కోరమండల్ అగ్రి సైన్సెస్ ఏరియా మేనేజర్ గుత్తికొండ రామ్ రెడ్డి అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం  అమర్ నగర్ లో గురువారం ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో రామిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని గ్రామ మొత్తానికి శానిటైజర్ లు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోరమండల్ అగ్రి సైన్సెస్ తరపున రైతులు బాగుండాలని,తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు.ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనాతో విలవిల లాడుతుందని,కొన్ని రోజుల పాటు జాగ్రత్తలు పాటించాలని కోరారు.

జన విజ్ఞాన వేదిక నల్లగొండ జిల్లా అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కోరమండల్ అగ్రి సైన్స్ వారు తమ గ్రామానికి వచ్చి అందరికీ శానిటైజర్ లు పంచడం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సేల్స్ మేనేజర్ నర్సిరెడ్డి,రిప్రజెంటివ్ సైదిరెడ్డి, గ్రామ నాయకులు,రైతులు అజయ్ రెడ్డి,మట్టా రెడ్డి,మన్మధ రెడ్డి సైదా, బుచ్చిరెడ్డి, భీమయ్య,సక్రు,సైదిరెడ్డి, రామిరెడ్డి, సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Related posts

విశాఖ సముద్రంలో 50 అడుగుల భారీ మత్స్యం..!!

Satyam NEWS

అనాథల బంగారు భవిష్యత్తే ప్రభుత్వ ధ్యేయం

Satyam NEWS

గృహలక్ష్మి పథకానికి 10 వరకే గడువు

Bhavani

Leave a Comment