సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నామని, గౌడ జేఎసి రాష్ట్ర కోకన్వినర్ ముత్యం ముఖేష్ గౌడ్ అన్నారు. 12 మంది సైన్యం తో 12 వేల మంది సైన్యాన్ని నిర్మించి గోల్కొండ కోటను ఏలిన గొప్ప రాజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన అనంతరం పాపన్న చరిత్ర మరింత వెలుగులోకి వచ్చిందన్నారు. అధికారికంగా నిర్వహించడానికి కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటి శాఖ మంత్రి కేటీఆర్, అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వాడ వాడన పాపన్న వర్ధంతి నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గౌడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు తాళ్ళ ఆనంద్ గౌడ్,యువజన నాయకులు బుడంపల్లి నిరంత్ గౌడ్, సట్ల నవీన్ గౌడ్, పొడుపునూరి మల్లేష్ గౌడ్, హరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, మేడ్చల్