గచ్చిబౌలి డివిజన్, దర్గా నుండి భారతీయ జనతా పార్టీలో చేరిన యువకులు, స్థానిక కాలనీ వాసులు
ఈరోజు గచ్చిబౌలి డివిజన్, దర్గా నుండి సామ్రాట్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో యువకులు భారతీయ జనతా పార్టీలో చేరారు. వారిని కండువా కప్పి పార్టీలోకి బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ బి.ఆర్.ఎస్ పార్టీ 9 ఏళ్ల పాలనలో ప్రజలను మాయ మాటలతో మభ్య పెడుతూ మోసం చేస్తూనే ఉన్నారని, ఇంటికో ఉద్యోగం నిరుద్యోగ భృతి, మోడ్రన్ స్కూల్స్, కేజీ టూ పి.జి ఉచిత విద్య, దళితులకు 3 ఎకరాల భూమి, బి.సి లకు 33% రిజర్వేషన్లు , 25 వేల కోట్లు, ఎస్టి లకు ట్రైబల్ యూనివర్సిటీ, గిరిజన బంధు, టెక్స్టైల్ జోన్ ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. ఎమ్మెల్యే గాంధీ నియోజకవర్గాన్ని అవినీతికి, భూ కబ్జాలకు , అక్రమాలకు , వసూళ్లకు అడ్డాగా మార్చారన్నారు.
కాలనీ లలో సమస్యలు వైఫల్యం , మౌలిక వసతుల కల్పనలో వైఫల్యం, డ్రైనేజీ వ్యవస్థ సరిగా ఏర్పాటు చేయడంలో వైఫల్యం ,ప్రజలను ప్రజా సమస్యలను పట్టించుకున్న పాపానపోలేదన్నారు. ఈ ప్రాంతానికి మాకు చాలా అనుబంధం ఉందని, మనం కష్టపడి గంగాధర్ రెడ్డిని గెలిపించుకున్నామని, మనం ఏ పని కావాలన్న ప్రభుత్వంతో కొట్లాడిన అరకొర పనులను చేయించుకోగలుగుతున్నామని , అలాగే రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ని గెలిపించుకుని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందామని తెలియజేశారు.
ప్రతి కార్యకర్తకు అండగా నేనున్నా, భారతీయ జనతా పార్టీ ఉందని , మీకు ఏ కష్టం వచ్చినా, ఏ సమయం లోనైన మీకు అండగా ఉంటానని భరోసా కల్పించడం జరిగింది. నరేందర్ చారి, రాజేష్ గౌడ్, శివ ముదిరాజ్, శరత్ , శివా రెడ్డి, సర్దార్, రాజేష్ యాదవ్ వారి సహచరులు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాధాకృష్ణ యాదవ్, ఎల్లేష్, శ్రీనివాస్ చారి , నరేందర్ గౌడ్ ,జితేందర్ కృష్ణ యాదవ్ , శ్యామ్ యాదవ్, సాయి, అమర్ యాదవ్ , కరణ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.