రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు సెప్టెంబర్ ఒకటి నుండి ప్రారంభమైన పాఠశాలల ప్రత్యక్ష తరగతులను ఆరోగ్యకరమైన వాతావరణంలో నిర్వహించాలని హుజుర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల మండలం ఉన్నత పాఠశాలను సైదిరెడ్డి సందర్శించి పారిశుద్ధ్య పనులు పరిశీలించారు.
ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ తరగతి గదులను,వంట గదులు పూర్తిస్థాయిలో శానిటైజ్ చేసి ఆరోగ్య కరమైన పరిసరాలను రూపొందించాలని తెలిపారు.దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందని 16 నెలలుగా మూతబడి ఉన్నటువంటి పాఠశాలలు ప్రారంభమైన సందర్భంలో పూర్తిస్థాయి పారిశుద్ధ్యాన్ని నిర్వహించాలని అన్నారు . మధ్యాహ్న భోజనానికి వినియోగించే వంట పాత్రలను వేడి నీటితో శుభ్రం చేయాలని సూచించారు.పాఠశాల అభివృద్ధికి తన వంతు ప్రత్యేక చేయూత అందిస్తానని అన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్