30.7 C
Hyderabad
April 29, 2024 03: 35 AM
Slider విజయనగరం

డీపీఆర్ఓ ఆధ్వ‌ర్యంలో జర్న‌లిస్ట్ ల‌కు కరోనా వ్యాక్సిన్…!

#Journalist

కరోనా సెకండ్ వేవ్ మొద‌లైంద‌న్న సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్తలు..అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల‌లో ఆందోళ‌న‌మొద‌లైంది. దీంతో అన్ని వ‌య‌స్సు ల వారు క‌నీసం జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

మ‌రోవైపు కేంద్ర‌,రాష్ట్ర ప్రభుత్వాలు కూడా క‌రోనా వ్యాక్సిన్ అంద‌రికి వేసే చ‌ర్య‌ల‌కు చేప‌ట్టింది కూడ‌. మొన్నామ‌ధ్య విజ‌య‌న‌గ‌రంలో జిల్లా రెవిన్యూ యంత్రాంగం..మొత్తం క‌రోనా వ్యాక్సినేష‌న్ వేయించుకుంది.

అందుకు ముందు డాక్ట‌ర్లు వేయించుకున్నారు. తాజాగా….మౌస్, క‌లం చేత ప‌ట్టే జ‌ర్న‌లిస్ట్ లు కూడా క‌రోనా వ్యాక్సినేష‌న్ వేయించుకుంటున్నారు.తాజాగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో పౌర‌సంబంధాల‌శాఖ స‌హాయ  సంచాల‌కులు ర‌మేష్ ఆధ్వ‌ర్యంలో జిల్లా కేంద్రంలోఉన్న జ‌ర్న‌లిస్టు అంద‌రూ దాదాపు 45 మంది క‌లెక్ట‌రేట్ లోని డీపీఆర్వ్ ఓ కార్యాల‌యంలో వైద్య సిబ్బందిని ప్ర‌త్యేకించి ర‌ప్పించి… క‌రోనా వ్యాక్సినేష‌న్ ను జ‌ర్న‌లిస్టులంద‌రికీ వేయించారు…డీపీఆర్ఓ.

ఈ వ్యాక్సినేష‌న్ కు ఏబీఎన్ ఛాన‌ల్ ప్ర‌తినితి శ్రీనివాస‌రావు,విశాలాంద్ర ప్ర‌తినిథి న‌ర‌సింహ‌రావు,హిందూ ప్ర‌తినితి శ్రీనివాస్, సాక్షి  ప్ర‌తినిథి త్రినాద్, ఆన్ లైన్ న్యూస్ ప్ర‌తినిధి భ‌ర‌త్ కుమార్, అదే విదంగా సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ చ‌క్ర‌వ‌ర్తి,పాత్రో,శ‌ర్మ‌, ఇత‌ర ప‌త్రిక‌ల జ‌ర్న‌లిస్ట్ లు ఈ క‌రోనా వ్యాక్సిన్  ను వేయించుకున్న వారిలో ఉన్నారు.

Related posts

ప్రాధాన్యత పథకాల లక్ష్యాలు పూర్తి చేయాలి

Bhavani

వత్తిడి ఉంది కానీ కండువా మార్చను

Satyam NEWS

ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలం

Satyam NEWS

Leave a Comment