కరోనా వైరస్ మరో ప్రాణాన్ని పొట్టన పెట్టుకుంది. కరోనా వైరస్ సోకిన 69 ఏళ్ల మహిళ ఒకరు ఢిల్లీలో మరణించారు. దేశంలో ఇది రెండో మరణం. ఆమెకు డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్నాయి. వాటితో కరోనా వైరస్ కూడా సోకడంతో ఆమె కోలుకోలేకపోయింది. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది.
దేశంలోని చాలా రాష్ట్రాలు స్కూళ్లు కాలేజీలు మూసేశాయి. కర్నాటకలో అయితే పబ్ లు, సినిమాహాళ్లూ మూసివేశారు. ఐపిఎల్ మ్యాచ్ లను వాయిదావ వేశారు. దేశంలో మొత్తం 81 మందికి కరోనా వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో 17 మంది విదేశాల నుంచి వచ్చిన వారు.