33.2 C
Hyderabad
May 4, 2024 01: 51 AM
Slider శ్రీకాకుళం

సంక్షేమం కొనసాగాలంటే జగనన్న బలపడాలి

srikakulam

రాబోయే నాలుగున్నర సంవత్సరాలు కూడా జగనన్న ఇంకా పెద్ద ఎత్తున సంక్షేమ పధకాలు చేపట్టి పేద ప్రజలని ఆదుకుంటారని అందుకే స్థానిక సంస్థల ఎన్నికలలో ఆయనకు మద్దతుగా నిలవాలని వైసీపీ మహిళా సమన్వయకర్త పిరియా విజయ అన్నారు.

నేడు ఆమె ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలం పెద్ద మెలియాపుట్టుగ, డొంకపుట్టుగ  గ్రామాలలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. పేదరికం నిర్మూలనకు జగనన్న ఎంతగానో కృషి చేస్తున్నారని, అలాగే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం ఎన్నో ప్రోజెక్ట్ లు రూపకల్పన చేస్తున్నారని ఆమె అన్నారు. సంక్షేమ పధకాలు ప్రతీ పేద ఇంటికి చేరేవిధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆమె అన్నారు.

ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పూడి లక్ష్మణరావు,  ఆరంగి మధు, బెందాలం నారాయణ మూర్తి, ఎర్ర బెన్ను, ఎంపిటీసీ అభ్యర్ధి మానేక శంకర్ ప్రధాన్, పిరియా వెంకట రమణ, పూర్ణచంద్ర ప్రధాన్, డొoబురు పాల్గొన్నారు.

Related posts

మంత్రి పువ్వాడకు బ్రాహ్మణ సంఘం మద్దతు

Bhavani

మినీ మేడారం జాతరకు సకల సౌకర్యాలు

Satyam NEWS

ఈ వాన కాలం లోపే మన చెరువులు నింపుకుందాం

Satyam NEWS

Leave a Comment