సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ అమరవరం గ్రామ సర్పంచ్ గుజ్జుల సుజాత అంజిరెడ్డి ఆధ్వర్యంలో అమరవరం మాజీ సర్పంచ్ ఉస్తెల చిన శంబిరెడ్డి ని స్మరించుకుంటూ వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి వారి ఆశయాలను సాధిద్దామని అన్నారు.
ఉగాది పర్వదిన సందర్భంగా అన్నదానంలో భాగంగా గ్రామ ప్రజలకు ఉగాది ప్రసాదం(పచ్చడి),పులిహోర పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సుజాత అంజిరెడ్డి మాట్లాడుతూ హుజూర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి నాయకత్వంలో,జడ్పిటిసి కొప్పుల సైది రెడ్డి సహకారంతో,అమరవరం గ్రామ టిఆర్ఎస్ నాయకుల సహకారంతో గ్రామ అభివృద్ధికి,గ్రామ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో నిరంతరం కృషి చేస్తున్నానని అన్నారు.ప్రజల సహకారంతో ఇంకా ముందు ముందు మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు.ఈ శుభకృత్ నామ సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో, పాడి పంటలతో,అష్టైశ్వర్యాలతో,సంతోషంగా జీవించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఉస్తేల చిన శంభిరెడ్డి అభిమానులు, టిఆర్ఎస్ నాయకులు,వార్డు మెంబర్లు,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్