గ్రామ భారతి మరియు మన ఊరు మన బాధ్యత సంయుక్త ఆధ్వర్యంలో రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకృతి రైతు కుటుంబాలను ప్రకృతి ప్రేమికులను హైదరాబాదులో నేడు ఘనంగా సత్కరించారు.
ప్రకృతి వ్యవసాయాన్ని చేసి రైతులను ప్రోత్సహిస్తూ, ప్రభుత్వ పథకాలు రైతులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ , జర్నలిస్ట్ గా గురుతరమైన బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ విలేకరి(దూరదర్శన్) మల్యాల బాలస్వామికి ఆత్మీయ సత్కారం అందజేశారు.
సీనియర్ జర్నలిస్టు రాంబాబు, కవి రచయిత అప్పాల ప్రసాద్, గ్రామ భారతి ప్రధాన కార్యదర్శి పి కరుణాకర్ గౌడ్ తదితరులు సత్కరించిన వారిలో ఉన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి