37.2 C
Hyderabad
May 6, 2024 15: 01 PM
Slider హైదరాబాద్

శంకర్ నగర్ సమస్యలను కైలాస శంకరుడే తీర్చాలా

#shankarnagar

శంకర్ నగర్ లోని కాలనీ సమస్యలు కైలాస శంకరుడే తీర్చగలడంటూ రవి కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఆదివారం చందానగర్ డివిజన్ పరిధిలో శంకర్ నగర్ కాలనీలో పలు సమస్యలపై కాలనీవాసులతో కలిసి బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ స్థానిక ప్రజా ప్రతినిధి కాంట్రాక్టర్లకు డబ్బులు కట్టబెట్టడానికి అవసరం లేని చోటల్లా రోడ్లను తవ్వి మరమ్మత్తులు చేయకుండా గాలికి వదిలేస్తున్నారని ఎద్దేవా చేశారు.

శంకర్ నగర్ కాలనీలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్న అధికారులకు స్థానిక ప్రజాప్రతినిధులకు కమిషన్లు ఇవ్వాల్సిందేనని కాలనీ మహిళలు  ఆయన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. రోడ్లు తవ్వి దాదాపు రెండు నుంచి మూడు నెలలు గడిచిన నేటికీ మరిమత్తులు చేయడం మర్చిపోయారని, ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిహెచ్ఎంసి అధికారులు అభివృద్ధి పనులను పక్కనపెట్టి ప్రజా ప్రతినిధులకు వంతనా పలుకుతున్నారని ఆయన విమర్శించారు.

సోమవారం కాలనీవాసుల సమస్యలపై డిప్యూటీ కమిషనర్ ను కలిసి వినతిపత్రం అందించి పలు అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని విన్నవిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లేష్ అనిల్ కుమార్ యాదవ్ చందర్ యాదవ్ రవి ఎస్ఎస్ రావు వెంకట్రావు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

Related posts

లోక్ సభ స్పీకర్‌ తో ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ

Satyam NEWS

విశ్వబ్రాహ్మణులకు నిత్యావసర సరుకుల పంపిణీ

Satyam NEWS

బర్డ్‌లో ఒకేరోజు ఏడుగురు చిన్నారులకు గ్రహణమొర్రి శస్త్రచికిత్సలు

Bhavani

Leave a Comment