కడప జిల్లా రాజంపేట పట్టణంలో గురువారం విశ్వబ్రాహ్మణుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు విశ్వనాథ చారి ఆధ్వర్యంలో 200 విశ్వబ్రాహ్మణ కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. రాజంపేట పట్టణంలో ని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పేద విశ్వ బ్రాహ్మణ కుటుంబాల వారికి ఉచిత నిత్యావసర వస్తువులను పంపిణీ అందజేశారు.
విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు విశ్వనాథ చారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు విశ్వ బ్రాహ్మణ సంఘ పెద్దలు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి తో ఇక్కట్లు పడుతున్న పేద విశ్వ బ్రాహ్మణులను చిరు సహాయం అందిస్తున్నట్టు విశ్వనాధ ఆచారి తెలిపారు.