ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా వెండిని తరలిస్తుండగా జగిత్యాల పోలీసులు పట్టుకున్నారు. తమిళనాడు నుంచి జగిత్యాల జిల్లా మెట్పల్లికి కారులో వెండిని అక్రమంగా తరలిస్తుండగా టాస్క్ఫొర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి 136 కిలోల వెండి, 10 లక్షల నగదును, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల జిల్లా ఎస్పీ సింధూశర్మ జగిత్యాల పట్టణ పోలీస్స్టేషన్లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఈ వివరాలను వెల్లడించారు. ఆమె వెంట ఏఎస్పీ దక్షిణామూర్తి, డీఎస్పీ వెంకటరమణ, సీఐ జయేష్రెడ్డి పాల్గొన్నారు. టాస్క్ఫొర్స్ సీఐ అరీఫ్ అలీఖాన్, పట్టణ సీఐ జయేష్రెడ్డి, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.