టర్కీ, ఇజ్రాయెల్, సిరియా, లెబనాన్లలో బలమైన భూకంపాలు ఎన్నో చాలా మేరకు విధ్వంసం సృష్టించాయి. నేడు సంభవించిన భూకంపంతో టర్కీ, సిరియాలో గరిష్ట ప్రభావం కనిపించింది. ఇప్పటివరకు ఇక్కడ 1500 మందికి పైగా మరణించారు. ఐదు వేల మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఇజ్రాయెల్, లెబనాన్లలో కూడా అనేక మరణాలు బయటపడుతున్నాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.8గా నమోదైనట్లు సమాచారం. దీంతో పలు భవనాలు పేకమేడలా కూలిపోయాయి. రోడ్ల మధ్య చీలిక ఏర్పడింది. అనేక వంతెనలు కూడా కూలిపోయాయి. భూకంప ప్రకంపనలు విధ్వంసం సృష్టించడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఇలాంటి ప్రకంపనలు విధ్వంసం సృష్టించాయి.
అలాంటి 10 భయంకరమైన భూకంప ప్రకంపనలు ఇవి:
మార్చి 11, 2011 నాడు జపాన్లో సంభవించిన భారీ భూకంపం, తర్వాత వచ్చిన సునామీ యావత్ దేశాన్ని విధ్వంసం అంచుకు చేర్చింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఆ కాలంలో 18 వేల మంది మరణించారు. ఆ నాటి ఆ భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్ పై 9గా నమోదైంది. సునామీ కారణంగా జపాన్ తీర ప్రాంతాల్లో నిర్మించిన మూడు లక్షలకు పైగా భవనాలు కొట్టుకుపోయాయి.
2015 ఏప్రిల్ 25న నేపాల్లో రెక్టర్ స్కేల్ పై 8.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇందులో 10 వేల మందికి పైగా మరణించగా, 23 వేల మందికి పైగా గాయపడ్డారు. ఈ విధ్వంసం భయం నేటికీ నేపాల్ ప్రజలలో కనిపిస్తుంది. భూకంప ప్రభావం భారత్, చైనా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ వరకు కనిపించింది.
మే 22, 1960న చిలీలోని బాల్దీవియాలో సంభవించిన భూకంపం అనేక దేశాలను వణికించింది. ఈ భూకంప తీవ్రత 9.5గా నమోదైంది. దీని నుండి తలెత్తిన సునామీ అలలు చిలీతో సహా జపాన్, ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియాలో పెను విధ్వంసం సృష్టించాయి. ఒక్క చిలీలోనే 12 వేల మందికి పైగా మరణించారు. అదే సమయంలో, జపాన్, ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియాలో సుమారు 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
మార్చి 27, 1964న, USAలోని అలస్కాలో 9.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. నాలుగు నిమిషాల పాటు భూమి కంపించింది. ఇది అలాస్కా మొత్తం మ్యాప్ను మార్చింది. లక్షల ఇళ్లు పేకమేడలా చెల్లాచెదురయ్యాయి. ఇందులో 200 మందికి పైగా మరణించగా, ఎనిమిది వేల మందికి పైగా గాయపడ్డారు.
2004 డిసెంబర్ 26న శ్రీలంక భూకంపం ప్రభావం దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో కూడా కనిపించింది. ఒక్క శ్రీలంకలోనే 10 వేల మందికి పైగా చనిపోయారు. ఈ భూకంప తీవ్రత 9.2గా నమోదైంది. భూకంపం సముద్రంలో సునామీకి కారణమైంది. ఇది శ్రీలంకలోని అనేక తీరప్రాంత నగరాలను నాశనం చేసింది. భారత్లోనూ తీరం వెంబడి ఉన్న నగరాల్లో భారీ నష్టం వాటిల్లింది. ఈ భూకంప కేంద్రం సముద్రగర్భంలో ఉంది. భారతదేశంలో దాదాపు ఐదు వేల మంది మరణించారు.
11 ఏప్రిల్ 2012న ఇండోనేషియాలోని సుమత్రాలో సంభవించిన భూకంపం చాలా విధ్వంసం సృష్టించింది. దీని తీవ్రత 8.6గా ఉంది. ఈ ఘటనలో 100 మందికి పైగా మరణించగా, వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి.
భారతదేశంలోని కచ్ భుజ్లో జనవరి 26, 2001 న సంభవించిన భూకంపం చాలా విధ్వంసం సృష్టించింది. ఈ భూకంపం తీవ్రత 7.7గా నమోదైంది. ఇది గుజరాత్లో ఘోర విధ్వంసం సృష్టించింది. కచ్ మరియు భుజ్లలో 30 వేల మందికి పైగా మరణించారు. అదే సమయంలో లక్షన్నర మందికి పైగా గాయపడ్డారు. భూకంపం కారణంగా గుజరాత్లో నాలుగు లక్షలకు పైగా ఇళ్లు కూలిపోయాయి. దీని ప్రభావం పాకిస్థాన్లోనూ కనిపించింది.
31 మే 1935 నాడు బలూచిస్తాన్లోని క్వెట్టా నగరంలో భూకంపం భారీ విధ్వంసం సృష్టించింది. దీని తీవ్రత 7.7గా ఉంది. ఈ సమయంలో, 60 వేల మందికి పైగా మరణించారు. రెండు లక్షల మందికి పైగా గాయపడ్డారు. భూకంపం కారణంగా మూడు లక్షలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి.
2005లో, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భూకంప ప్రకంపనలు భారీ విధ్వంసం సృష్టించాయి. ముజఫరాబాద్లో సంభవించిన భూకంపం ప్రభావం బాలాకోట్, ఖైబర్ పఖ్తుంఖ్వా మరియు భారత భూభాగం వరకు కనిపించింది. ఆ సమయంలో పీఓకేలో 86 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రెండు లక్షల మందికి పైగా గాయపడ్డారు.
జనవరి 12, 2010 న, హైతీలో భూకంపం గొప్ప వినాశనాన్ని కలిగించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7గా నమోదైంది. ఈ భూకంపంలో ఎక్కువ విధ్వంసం రాజధాని పోర్ట్ ఆఫ్ ప్రిన్స్లో జరిగింది. భూకంపం తర్వాత కూడా 50కి పైగా ప్రకంపనలు సంభవించాయి. ఈ భూకంపం వల్ల దాదాపు మూడు లక్షల మంది చనిపోయారు.