34.2 C
Hyderabad
May 13, 2024 16: 52 PM
Slider మహబూబ్ నగర్

కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

#revanthreddy

వివిధ మండలాలలోని బిఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలు కార్యకర్తలు భారీగా కాంగ్రెస్ పార్టీలోకి  చేరారు. శుక్రవారం హైదరాబాద్ గాంధీ భవన్ లో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో,డిసిసి అధ్యక్షులుమాజీ అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ  ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. రాజేందర్ కి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా టి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నేత టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా డిఆర్ఎస్ ముఖ్య నేత అడ్వకేట్ గంగాపురం రాజేందర్ వంగూరు మండల మాజీ జడ్పిటిసి భీముడు నాయక్ వివిధ మండలాల నుంచి 200 మంది దాకా నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం తెలంగాణకు శుభదినమని ఆయన అన్నారు.

రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకారులందరూ కాంగ్రెస్ పార్టీలోకి చేరి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో పయనించే విధంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు గుర్తించాలని సూచించారు.

టిఆర్ఎస్ పార్టీకి రెండుసార్లు అవకాశం ఇచ్చి నష్టపోయామనేది ప్రజలు గుర్తించారని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారనేది అవకాశం ఇస్తారనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.                  

Related posts

వయసు చిన్నదే అయినా…మనసు మాత్రం పెద్దది

Satyam NEWS

58, 59 జిఓ ల అమలలో వేగం పెంచాలి

Bhavani

కరోనా నివారణకు ఇంటింటికీ శానిటైజర్లు పంపిణీ

Satyam NEWS

Leave a Comment