33.7 C
Hyderabad
April 30, 2024 00: 54 AM
Slider ముఖ్యంశాలు

అక్రమంగా మోపిన ఉపా కేసు ను వెంటనే ఎత్తివేయాలి

#V. Sandhya

పోలీసులు మహిళా నేత వి.సంధ్య, ప్రజాపక్ష మేధావి ప్రొఫెసర్ జీ. హరగోపాల్ తదితర 152 మంది ప్రజాసంఘాల నాయకులపై తప్పుడు పద్ధతుల్లో రాజద్రోహ కుట్ర కేసు ఐయిన ఉపా కేసును నమోదు చేశారని, వీరంతా మావోయిస్టు పార్టీ కి అనుబందంగా ఉండే సంఘాల్లో పని చేస్తూ రాజద్రోహనికి పాల్పడుతున్నారని పేర్కొని, వీరినందరిని కఠినంగా శిక్షించాలని అక్రమంగా, తప్పుడు కేసులను బనాయించారని, ఉపా తో పాటు అన్ని కేసులను ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.

సంధ్య గత నాలుగు దశబ్దాలకు పైగా మహిళల హక్కుల కోసం పోరాడుతున్న చరిత్ర అందరికి తెలిసిందేన్నారు . పిఓడబ్ల్యూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా, జాతీయ కన్వీనర్ గా పని చేస్తున్న విషయం తెలుగు నేలంతా తెలిసిందేనని, .తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం లో మొదటి వరుసలో నిలబడి కొట్లాడిన వాస్తవం నేటి ముఖ్యమంత్రి కెసిఆర్ తో సహా అందరికి తెలిసిన విషయమేనని, మహిళా హక్కుల కోసం నలభై ఏళ్లకు పైగా అవిశ్రాంతంగా

ప్రజాస్వామిక పద్ధతుల్లో పోరాడుతున్న సంధ్యను నిషేధిత మావోయిస్టు పార్టీ కి చెందిన వ్యక్తి గా ముద్రవేయడం అత్యంత దుర్మార్గమైనదని, హైదరాబాద్ నగరాన్ని కేంద్రంగా చేసుకొని అలుపెరుగని మహిళా నాయకురాలుగా ఉంటున్న సంధ్య ను మావోయిస్టు దళాల్లో తిరుగుతున్నట్లు, ఆ పార్టీ లోకి క్యాడర్ ను రిక్రూట్ చేస్తున్నట్లు నూటికి నూరు పాల్ల అబద్దాలతో పోలీసులు కట్టుకథలల్లీ ఉపా లాంటి రాజద్రోహ కుట్ర కేసును బనాయుంచడాన్ని తమ పార్టీ తీవ్రంగా డిస్తున్నదన్నారు
బొంబాయి కి చెందిన న్యాయమూర్తి సురేష్ గారు రొండేళ్ల క్రితం మరణిస్తే ఆయన పేరు ను కూడా ఈ కేసులో ఇరికించడం తెలంగాణ పోలీస్ ప్రత్యేకత గా ఉన్నదన్నారు .

అంతే కాదు, తెలుగు నేలకే కాదు యావత్ దేశానికి, ఆ మాటకొస్తే ప్రపంచానికి హక్కుల నాయకుడిగా, మేధావిగా, గొప్ప రాజనీతి ఆచార్యులుగా కొన సాగుతున్న ప్రో. హరగోపాల్ పైనా ఈకేసును మోపారన్నారు. అరుణదయ విమలక్క, మోహన్ బైరాగి తో పాటు తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘము మాజీ అధ్యక్షులు గా పని చేసిన రఘునాధ్, సీల్సీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొ. గడ్డం లక్షణ్, ప్రొ. పద్మజా షా, ప్రొ. కాశీoలతోసహ మొత్తం 152 మందిపై కేసు పెట్టడం దారుణం అన్నారు.

కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వాళ్ళే గాకుండా ఇప్పటికే జైల్లో ఉండి బెయిల్ పై ఉన్న సుధా భరద్వాజ్, సురేంద్ర గాడ్లిoగ్ తదితరులనేక మంది పై కూడా పెట్టారు.ములుగు జిల్లా పోలీసులు అక్రమంగా బనాయించిన ఈ అక్రమ, తప్పుడు కేసును వెంటనే ఉపసహారించుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రజాసంఘాల నాయకుల్ని, కార్యకర్తలను నిషేధిత మావోయిస్టు లుగా ముద్రవేసి, వారి పై దేశాద్రోహం, అర్మ్స్ యాక్ట్ లాంటి అనేక చట్టాలు మోపి అణచివేత, నిర్భంధానికి గురి చేయడం ఎంతమాత్రం సరికాదని, ఇది ముమ్మాటికీ ఫాసిస్ట్ నియంతృత్వమే నన్నారు.తెలంగాణ రాష్ట్ర సాధన తోపాటు, పోరాడి సాధించుకున్న తెలంగాణ లో అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న అనేక మంది ప్రజా నాయకులను, మేధావులను అక్రమ కుట్ర కేసుల్లో ఇరికించడాన్ని ఇకనైనా మానుకోవాలని కెసిఆర్ ప్రభుత్వాన్ని కోరారు.

Related posts

టైక్వాండో శిక్షణా తరగతులను ప్రారంభించిన ములుగు సీఐ

Satyam NEWS

ఇటుక బట్టీలతో ప్రబలుతున్న విషవాయువులు

Bhavani

గజ్వేల్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి అత్యవసర చర్యలు

Satyam NEWS

Leave a Comment