సోమశిల అర్బన్ ఫారెస్టు పార్క్ పనులను మరింత వేగవంతం చేయాలని అటవీ సంరక్షణ ముఖ్యాధికారి, ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ బి. శ్రీనివాస్ ఆదేశించారు. సోమశిల అర్బన్ ఫారెస్టు పార్క్ పనులను ఆయన సందర్శించారు. అర్బన్ ఫారెస్టు పార్క్ ను వన్యప్రాణులకు ఆవాసంగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు. అచ్చంపేట అటవీ డివిజనల్ అధికారి జి. రోహిత్, కొల్లాపూర్ అటవీ శాఖ అధికారి శరత్ చంద్రా రెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు. సోమశిల అర్బన్ పార్క్ లో జరుగుతున్న అటవి అభివృద్ధి పనులను పరిశీలించి అభివృద్ధి పనులకి కావలసిన సూచనలు చేసారు.
previous post