విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా పాటిల్…విజయనగరం పోలీసు సబ్ డివిజన్ పరిధిలోని కొత్తవలస పోలీసు స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీఎస్ ను ఆకస్మికంగా సందర్శించి, స్టేషను ప్రాంగణం, ప్రాపర్టీ రూం, సిడి ఫైల్స్, స్టేషను రికార్డులను పరిశీలించి, పోలీసు సిబ్బందితో మమేకమై, విధుల నిర్వహణపై, వారి సమస్యలను అడిగి తెలుసుకొని, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.
జిల్లా ఎస్పీ సందర్శన సమయంలో కొత్తవలస సీఐ వి.చంద్రశేఖర్, ఎస్ఐలు వై.వి.జనార్ధన్, బి.దేవి మరియు ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు.అక్కడ నుంచీ కొత్తవలస మంగలపాలెంలో శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్టు 25వ వార్షికోత్సవంకు జిల్లా ఎస్పీ దీపికా ముఖ్య అతిథిగా హాజరయ్యారు,. వార్షికోత్సవం సందర్భంగా దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు, ట్రై సైకిల్స్, చెవిటి మిషన్స్, నిరు పేదలకు చీరలు, కోలాటం నిర్వహించే బృందాలకు కంజర్లు, మ్యూజిక్ వాయిద్యాలను ట్రస్టు తరుపున జిల్లా ఎస్పీ అందజేశారు.ఈ కార్యక్రమంలో ట్రస్టు అధ్యక్షులు జగదీష్ బాబు,, ఇతర పోలీసు అధికారులు, ట్రస్టు సభ్యులు, దివ్యాంగులు పాల్గొన్నారు.