హైదరాబాద్ లోని అంబర్ పేట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న గోల్నాక మార్కెట్లోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయ స్థలంలో అక్రమ నిర్మాణాలను తొలగించి, దేవాలయ స్థలాన్ని పరిరక్షించాలని శ్రీ హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. శ్రీ హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు నర్సింలు ముదిరాజ్, శ్యామ్ సతీష్ ముదిరాజ్, సతీష్ చారి తదితరులు జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ ఏసీపీ సాయి బాబా కు ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. బాలేష్ అనే వ్యక్తి అక్కడ భూ కబ్జాకు పాల్పడుతున్నాడని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. దేవిధంగా బస్తి అధ్యక్షుడు, సీనియర్ సిటిజన్ నర్సింలు ముదిరాజ్ పై దాడి చేసి కొట్టిన బాలేష్ అతని కుటుంబ సభ్యుల పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కాచిగూడ సర్కిల్ ఇన్స్పెక్టర్ హబీబుల్లా ఖాన్ ని వారు కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
previous post
next post