తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను శుక్రవారం రోజున విడుదల చేయనున్నట్లు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. డిసెంబరు నెల రూ.300 టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది. 11వ తేదీన ఉదయం 10 గంటలకు తితిదే వెబ్సైట్లో టికెట్లను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. వీఐపీ బ్రేక్ దర్శన వేళల్లో మార్పుల కారణంగా డిసెంబరు కోటా టికెట్ల విడుదల ఆలస్యమైందని తితిదే అధికారులు పేర్కొన్నారు.