సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని గోవిందాపురంలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామ నవమి పర్వదిన సందర్భంగా గురువారం తెల్లవారుజామున నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఎంతో అత్యంత వైభవంగా జరిగాయి.
కార్యక్రమంలో భాగంగా ఉదయం ఎనిమిది గంటలకి అభయాంజనేయ స్వామి వారికి పంచసూక్తాలతో పంచామృత అభిషేకం,నాగవల్లి దళాలతో అష్టోత్తర శతనామావళితో పూజా కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. అనంతం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ క్రతువు చూడ ముచ్చటగా అత్యంత వైభవోపేతంగా అర్చకులు నరిగిరినాధుని మోహనవంశీ నిర్వహించారు.శ్రీ స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ముందుగా విశ్వక్సేన
ఆరాధన,పుణ్యాహవాచనం, రక్షాబంధనం,స్వామివారి పాదప్రక్షాళన, మహా సంకల్పం,మాంగల్య సూత్ర పూజ జరిపించి స్వామివారి చేత సీతమ్మ వారికి ధరింపజేసి,అక్షితారోహణం నిర్వహించి, ధూప,దీప,నైవేద్యం,మహా మంగళ నీరాజనం,మంత్రపుష్పం సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.
సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భక్తులు కె.వెంకటేశ్వర్లు,అమర్నాథ్ రెడ్డి,కోలా నాగేశ్వరరావు,జి.వెంకట్ రెడ్డి,జైపాల్ రెడ్డి, డి.వెంకట్ రెడ్డి,లింగయ్య,రవీందర్ రెడ్డి ధనుంజయ,రాజు,శ్రీనివాసు అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్