కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఛాంబర్లో ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. మునుగోడు నియోజక వర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, పార్టీకి, పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు నియోజక వర్గంలో ఉప ఎన్నిక వచ్చింది. హోరా హోరిగా సాగిన ఈ ఎన్నికలలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అత్యధిక మెజారీటితో విజయం సాధించారు. ప్రభాకర్ రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రులు హరీష్ రావు, కేటిఆర్, పువ్వాడ అజయ్, జగదీశ్ రెడ్డి, మహమూద్ అలీ, ఎంఎల్ఏ లు, ఎంఎల్సి లు , పార్టీ నాయకులు పాల్గొన్నారు.
previous post