38.2 C
Hyderabad
April 29, 2024 22: 18 PM
Slider ప్రత్యేకం

వైభవంగా రామతీర్ధం సీతారాముల కల్యాణోత్సవం…!

#ramakalyanam

మూడేళ్ళ క్రితం జరిగిన ఘటనను మర్చిపోయినట్టేనా…?

మూడేళ్ళ క్రితం పురాతన కొండైన విజయనగరం జిల్లా నెల్లిమర్ల సమీపం బోడికొండ పై ఉన్న అతిపురాతన రాముని విగ్రహం తల తీసిన ఉదంతం తో ఆ కొండ అసలు చరిత్ర.. ఆ కిందనే ఉన్న రామతీర్ధం రాములోరి మరింత గా ప్రాముఖ్యత పెరిగింది. దరిమిలా అనతికాలంలోనే అయిదు కోట్ల తో అదే బోడికొండపై కొత్త ఆలయాన్ని జగన్ ప్రభుత్వం నిర్మించింది కూడా. అదే రామతీర్ధంలో సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు స్వామి వారి కల్యాణానికి ముత్యాల తాళం రాలు, పట్టు వస్త్రాలను సమర్పించారు. గోటి తో వొలిచిన 28 కేజీల తలంబ్రాలను కల్యాణానికి వినియోగించారు. 

టిటిడి నుండి,  సింహాచలం నుండి విచ్చేసిన వేద పండితుల ఆధ్వర్యంలో  కల్యాణం వైభోగంగా జరిగింది. ప్రముఖ పండితులు  మైలవరపు  శ్రీనివాస రావు వ్యాఖ్యానం ఆద్యంతం సందేశాత్మకంగా నిలిచింది. ఈ  కల్యాణోత్సవం లో  మంత్రి  బొత్స సత్యనారాయణ  దంపతులు, వారి కుటుంబ సభ్యులు, నెలిమర్ల ఎంఎల్ఏ బడ్డుకొండ అప్పల నాయుడు దంపతులు, ఎంపీ బెల్లాన చంద్ర శేఖర్, ఎం.ఎల్.సి డా.సురేష్ బాబు  పాల్గొన్నారు. తొలుత జె.సి. మయూర్ అశోక్,  ఆర్.డి.ఓ  సూర్య కళ, దేవస్థానం ఈ.ఓ కిశోర్ తదితరులు పూర్ణ కుంభ స్వాగతం పలికి వేదం మంత్రాలతో   మంత్రివర్యులు, శాసన సభ్యులను , జిల్లా జడ్జి కల్యాణ చక్రవర్తిని దేవాలయంలో సీతారాముల దర్శనానికి తీసుకు వెళ్ళేరు. అనంతరం కల్యాణ వేదిక వద్ద జరిగిన వేడుకలో పాల్గొన్నారు.

అనంతరం మంత్రి  బొత్స సత్యనారాయణ మీడియా తో మాట్లాడుతూ  స్వామి వారి ఆశీస్సులు ఈ ప్రభుత్వం పైనా, రాష్ట్ర ప్రజలందరి పైనా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.  పాడి పంటలు సమృద్ధిగా పండి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, రామతీర్థం మరో భద్రాచలంగా చెప్పుకోవచ్చునని, భద్రాచలంలో మాదిరిగానే ఇక్కడా అలాంటి సంప్రదాయంతో కళ్యాణోత్సవాలు నిర్వహించడం సంతోషాదాయకంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో రామతీర్ధం ఈఓ కిషోర్ కుమార్, శ్రీశ్రీ శ్రీ పైడితల్లి దేవస్థానం  ఈ.ఓ సుధారాణి, నెల్లిమర్ల మున్సిపల్ కమీషనర్, ఎం.పి.డిఓ, తహసీల్దార్, పలు ప్రజా ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

ఎం. భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా

Related posts

దళిత బంధు కోసం పాకులాడటం మంచిది కాదు

Satyam NEWS

ఎనాలసిస్: కొందరికే వినసొంపుగా తెలం‘గానం’

Satyam NEWS

రష్యా వార్నింగ్: మూడో ప్రపంచ యుద్ధం వచ్చేనా?

Satyam NEWS

Leave a Comment