26.2 C
Hyderabad
May 10, 2024 21: 52 PM
Slider ఆధ్యాత్మికం

శ్రీ సౌమ్యనాధ స్వామి బ్రహ్మోత్సవాలలో వైభవంగా ధ్వజావరోహణం

#Sri Soumyanadha Swamy

అన్నమయ్య జిల్లా నందలూరు లోని శ్రీ సౌమ్యనాధ స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.ఈ సందర్భంగా ఆలయాన్ని పచ్చటి తోరణాలు,పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు.బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం ఉదయం శ్రీ సౌమ్యనాధ స్వామి, లక్ష్మీ, గోదాదేవి అమ్మవార్లను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.

శాస్ర్తోక్తంగా రుత్వికులు సింహా లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభం మీదకు గరుడ పతాకం ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. ధ్వజారోహణం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు టీటీడీ జె.యి.ఓ సదా భార్గవి,ఎంపీపీ మేడా బాస్కర్ రెడ్డి ఆలయ సూపర్నిడెంట్ నాటేష్ ,ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్ అర్చకులు సునీల్,సాయి తదితరులు పాల్గొన్నారు.

Related posts

విద్యార్థులే పాఠాలు బోధించిన వేళ

Satyam NEWS

రాహుల్ ను అడ్డుకున్న మణిపూర్ పోలీసులు

Satyam NEWS

అతిరథ మహారథుల సమక్షంలో “సేవాదాస్” సాంగ్స్ రిలీజ్ ఫంక్షన్!!

Satyam NEWS

Leave a Comment